Monday, September 23, 2013

తెరమీదకు 'జైబోలో సమైక్యాంధ్ర'..!

'చందవోలు శోభారాణి' ప్రధాన పాత్రలో 'కృష్ణ', 'ముని చంద్ర', 'యామిని', 'చాణక్య' ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రం '' జై బోలో సమైక్యాంధ్ర''. 'లక్ష్మణ్ పూడి' డైరెక్ట్ చేస్తున్న
ఈ చిత్రాన్ని అక్టోబర్ 2నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ సినిమా వివరాలు సోమవారం మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసినిమాను తీస్తున్నాం. దీనిలో రాష్ట్రం విడిపోతే ఎన్ని కష్టాలు ఉంటాయి. కలిసి ఉంటే వచ్చే లాభాలేంటి అని చూపించబోతున్నాం. ఈ సినిమా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తాం'' అన్నారు. నటి కవిత మాట్లాడుతూ.. ' కొన్ని రాజకీయపార్టీలు తమ స్వార్థ రాజకీయాలకోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందరూ కలిసి కట్టుగా ఉండాలని సినిమా ముఖ్య ఉద్దేశ్యం.''అన్నారు.

No comments:

Post a Comment