ఢిల్లీ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేశారు. ఒక రాజ్యసభ ఎంపి, ఐదుగురు లోక్ సభ ఎంపీలు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో స్పీకరుకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రాంచంద్రరావు ఉన్నారు. పార్లమెంటు హాలులో సమావేశమైన అనంతరం వీరంతా రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేశారు. ఇక రాజీనామా బాటలో ఉన్న మంత్రులు పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పల్లంరాజు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రేపు ప్రధానితో ఓసారి సమావేశమై తర్వాత తుది నిర్ణయంతీసుకుంటారని తెలుస్తోంది.

No comments:
Post a Comment