Thursday, August 1, 2013

ప్రాజెక్టులకు వరద పోటు..

హైదరాబాద్రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోందిపలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయిగోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోందిభద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరిందిదీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారుఖమ్మం జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిస్థితులను సమీక్షించారుమధ్యాహ్నం 12 గంటల వరకు వరదనీరు 58 అడుగులకు చేరే అవకాశం ఉందని వెల్లడించారుకాళేశ్వరంపెన్ గంగఇంద్రావతి జలాశయాలు పొంగి పొర్లుతున్నాయితాలిపేరు ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 8.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందిబజార్ హత్నూరు మండలంలో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షం కురిసిందిపెన్ గంగాప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుతోందిదీంతో సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిస్వర్ణగడ్డెన్నకొమరంభీంమత్తడివాగుకడెం ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోందివర్షాలతో సింగరేణి వ్యాప్తంగా 15 ఉపరిత గనుల్లో 1.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందిశ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తుండడంతో 26 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారుశ్రీశైలం జలాశయానికి మాత్రం వరదనీటి ప్రవాహం తగ్గడంతో ఔట్ ఫ్లో తగ్గించారుఆలమట్టి నుంచి కూడా నీటి విడుదల తగ్గించారుజలాశయం నుంచి 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

No comments:

Post a Comment