ముంబయి: డాలర్ తో రూపాయి మారకం విలువ మళ్లీ కనిష్టస్థాయికి దిగజారింది. రూపాయి మారకం విలువ రూ.62.35 పైసలుగా ఉంది. ఇక స్టాక్ మార్కెట్ లు పతనం అంచున ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో, 80 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని వ్యాఖ్యలు.. మార్కెట్లపై ప్రభావం..
ప్రస్తుత వారంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని తెలిపారు. మరో వైపు అమెరికన్ కరెన్సీ డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆహార భద్రత సహా పలు బిల్లులు చర్చకు రానుండటంతో వీటికి ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ నిపుణులు వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ ముగియడంతో పాటు, మార్కెట్లను ప్రభావితం చేయగల దేశీయ అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లపైనే చూపు నిలుపుతారని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ ఛైర్మన్ నాగ్ జీ కె.రీటా చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం విడుదల చేయనున్న పాలసీ సమీక్ష వివరాలు (మినిట్స్) ప్రపంచ స్టాక్ మార్కెట్లకు కీలకంకానున్నాయని తెలిపారు.
n పెట్టుబడులపై నియంత్రణలు (క్యాపిటల్ కంట్రోల్) తీసుకువస్తుందన్న ఆందోళనతో గడిచిన శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువు ఒక్క సారిగా 62పైసలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల భారీ ఒడిదుడుకులకు లోనవుతున్న రూపాయి విలువ కారణంగా ఈక్విటీ మార్కెట్లు కూడా హెచ్చు తగ్గులను చవిచూస్తున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. ఇది ఇంతటితో ఆగే కాదని వ్యాఖ్యానించారు. చార్టుల ప్రకారం చూస్తే ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి సమీప మద్దతు స్థాయి 5,450 పాయింట్ల వద్ద ఉన్నదని చెప్పారు. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాలు మరింత ఉధృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే నిఫ్టీ 5,300 స్థాయికి దిగజారుతుందని అంచనా వేశారు. ఫలితంగా ట్రేడర్లు ట్రెండ్ కు విరుద్ధమైన రీతిలో పొజిషన్లు తీసుకోవడం ప్రమాదకరమని సూచించారు.రానున్న రోజుల్లో నిఫ్టీకి 5,480 స్థాయి కీలకంగా నిలవనున్నదని బొనాంజా పోర్ట్ పోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలకు మరింత అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు వచ్చే నెల ఆరంభం నుండి అమెరికా ఫెడరల్ రిజర్వు ఉద్దీపన పథకాలు ఉపసంహరించుకోవడం మొదలు పెడుతోందన్న సంక్షేతాలు ఇవ్వడంతో పాటు నిరుద్యోగ గణంకాలు మళ్లీ పెరగడం షేర్ల అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమైంది.
దేశీయ రుణ(డెట్) మార్కెట్ల నుండి ఈనెల తొలి రెండు వారాల్లో ఎఫ్ఐఐలు నికరంగా 96.2కోట్ల డాలర్ల(రూ.6,000కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ తరహా పెట్టుబడులపై లభించే రిటర్న్ లకు సంబంధించి పన్ను నిబంధనల్లో స్పష్టత లేకపోవడం దీనికి కారణంగా నిలుస్తోంది. మరో వైపు రూపాయి బలహీనపడటం కూడా ఇందుకు సహకరిస్తోంది. కాగా, సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి చూస్తే డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు మొత్తంగా రూ.51,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే 2013 జనవరి మొదలు తొలి ఐదు నెలల్లో నికరంగా రూ.25,000 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.

No comments:
Post a Comment