Wednesday, July 31, 2013

రాములమ్మపై వేటు

హైదరాబాద్ : మెదక్ ఎంపి విజయశాంతిపై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగంతో టిఆర్ఎస్ పార్టీ విజయశాంతిని
సస్పెండ్ చేసింది. ఇప్పటికే అనేక సార్లు ఆమెను క్షమించామని.. పొలిట్ బ్యూరో నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు విజయశాంతికి టీఆర్ఎస్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమె గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. 'రాష్ట్ర విభజన' ప్రకటన చేసినప్పుడు కూడా ఆమె పార్టీ నాయకులతో కలవలేదు. ఈ నేపథ్యంలో ఆమెపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఓ వైపు విజయశాంతి కాంగ్రెస్ లో కలవనున్నట్లు వార్తలు వస్తుంటే.. మరో వైపు ఆమె బిజెపిలో కి వస్తే తగిన స్థానం కలిపిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే మంగళవారం మీడియాతో మాట్లాడిన విజయశాంతి మాత్రం తాను ఏ పార్టీలో చేరుతుందో స్పష్టం చేయలేదు.

No comments:

Post a Comment