Saturday, July 27, 2013

తెలంగాణపై మళ్లీ పాతపాటే..

ఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ మరోమారు పాతపాటే పాడింది. తెలంగాణ విషయంలో చర్చలు ముగిశాయి ఇక పార్టీ, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వుందని శుక్రవారం
కోర్ కమిటీ భేటీ అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. తెలంగాణపై సంప్రదింపులు ముగిశాయి ఇక నిర్ణయమే తరువాయి అన్ని కోర్ కమిటీ భేటీకి ముందు చెప్పిన ఆయన సాయంత్రానికే మాటల గారడీ చేశారు. ఇటు పార్టీ, అటు యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుందని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణపై కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశగా ఎదురుచూసిన రాష్ట్ర నేతలకు మరోమారు నిరాశే ఎదురైంది. జులై 12 న జరిగిన కోర్ కమిటీ భేటీ అనంతరం చెప్పిన మాటలనే మార్చి చెప్పిన దిగ్విజయ్ మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తాత్సారం చేసే ధోరణినే అవలంభించనుందనేది తేటతెల్లమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

No comments:

Post a Comment